![]() |
![]() |
by సూర్య | Wed, Nov 23, 2022, 08:17 PM
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఈ సినిమాకి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవలే థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా టీమ్ కు షాక్ తగిలింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయవద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా యశోద సినిమా చూపించారని ఎవా హాస్పిటల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్ వేసింది. యశోద చిత్ర యూనిట్కి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా పడింది.
Latest News