![]() |
![]() |
by సూర్య | Thu, Sep 29, 2022, 03:37 PM
టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా కస్సాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం "శాకినిడాకిని". సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ థ్రిల్లర్ సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను అలరించలేకపోయింది.
దీంతో మేకర్స్ ఈ మూవీని పదిహేను రోజుల వ్యవథిలోనే డిజిటల్ రంగంలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుండే శాకినిడాకిని సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.
2017లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ 'మిడ్ నైట్ రన్నర్స్' కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీని డి. సురేష్ బాబు, సునీతా తాటి నిర్మించారు.