![]() |
![]() |
by సూర్య | Fri, Sep 23, 2022, 03:29 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం లైఫ్ లోనే చాలా టఫ్ టైం ను ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే, ప్రభాస్ పెదనాన్నగారు కృష్ణంరాజు గారు రెండువారాల క్రితమే హఠాన్మరణం చెందారు.
ఈ కష్టకాలంలో ప్రభాస్ ను ఇబ్బంది పెట్టకూడదని "సలార్" మేకర్స్ షూటింగ్ ను వాయిదా వేశారని టాక్ నడిచింది. ఐతే, లేటెస్ట్ గా ప్రభాస్ ఈ రోజు సలార్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లి, చిత్రబృందాన్ని షాక్ కు గురిచేశారట. ప్రభాస్ రాకతో ఖంగు తిన్న డైరెక్టర్ ప్రశాంత్ వెంటనే హీరోయిన్ శృతి హాసన్ కు షూటింగ్ కు రావాలని కబురు పంపించారట. ఇక, రేపటి నుండి వీరిద్దరి కాంబోలో వచ్చే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023లో విడుదల కానుంది.