by సూర్య | Thu, Sep 22, 2022, 08:29 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాది రాళ్లు. కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు". ఈ సినిమాతోనే శివశంకర వర ప్రసాద్ చిరంజీవిగా ప్రాణం పోసుకుని, 44 సంవత్సరాల పాటు మనల్ని ఉర్రూతలూగించారు.
22, సెప్టెంబర్ 1978లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కే వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి చక్రవర్తి సంగీతం అందించారు. రావుగోపాల రావు, జయసుధ, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ, నూతనప్రసాద్, రమాప్రభ కీలకపాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో హార్ట్ టచింగ్ పోస్ట్ పెట్టారు. నన్నింతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ట్వీట్ చేసారు.