by సూర్య | Mon, Aug 15, 2022, 05:54 PM
శనివారం విడుదలైన నిఖిల్ సిద్దార్ధ్ "కార్తికేయ 2" తొలిషోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుని, హౌజ్ ఫుల్ బోర్డులతో ధియేటర్లన్నింటిని ప్రేక్షకులతో నింపేస్తుంది.
ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాక ఉత్తరాదిన కూడా ఈ సినిమా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో దుమ్ము రేపుతోంది. హిందీలో తొలి రోజున 60 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆపై 300, 500 థియేటర్లను పెంచుకుంటూ పోతుంది. థియేటర్ల సంఖ్య వెయ్యి వరకు పెరిగే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు.
అదీకాక హిందీలో ఇటీవల రిలీజైన లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో, అక్కడి ప్రేక్షకులు కార్తికేయ 2 సినిమా పట్ల విశేష ఆసక్తిని కనబరుస్తున్నారు.