by సూర్య | Mon, Aug 15, 2022, 05:44 PM
గతేడాది డిసెంబర్ లో విడుదలై బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం "పుష్ప ది రైజ్". సుకుమార్ డైరెక్షన్లో రెడ్ శాండల్ స్మగ్గ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించారు.
ఇంతకీ విషయమేంటంటే, ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్గా నటించబోతున్నాడని గత కొన్నాళ్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై విజయ్ సేతుపతి క్లోజ్ సర్కిల్ మీడియాకు అధికారిక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేంటంటే, విజయ్ బాలీవుడ్ మూవీ "జవాన్" లో తప్పించి మరే ఇతర సినిమాలోనూ ప్రస్తుతానికైతే విలన్గా నటించట్లేదని వివరించారు. దీంతో పుష్ప ది రూల్ పై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని తేలింది.
ఐతే, పుష్ప లో విజయ్ ను తీసుకునే అవకాశాలైతే ఇంకా లేకపోలేదు. ఈ విలక్షణ నటుడు పుష్ప జోరుకు జత కుదిరితే, సినిమా మరొక లెవెల్ లో ఉండడం ఖచ్చితం.