by సూర్య | Mon, Aug 15, 2022, 04:32 PM
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తారక్ కెరీర్ లో 31 వ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా నిర్మింపబడుతుంది.
లోకల్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ మాట్లాడుతూ... తారక్ తో సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. అంటే ఆలోపు ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న "సలార్" షూటింగును ముగించనున్నారన్న మాట. అలానే అటు తారక్ కూడా కొరటాల శివతో చేసే సినిమాను వచ్చే ఏడాది మేకల్లా పూర్తి చేసి ప్రశాంత్ సినిమా కోసం సన్నద్ధమవ్వాలన్న మాట.
తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే.