by సూర్య | Wed, Aug 10, 2022, 06:31 PM
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ రూట్ ను మార్చిన దర్శకుల్లో ఒకరు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన పూరి "లైగర్" చిత్రంతో తొలి సారి పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూరికి బెస్ట్ విషెస్ తెలుపుతూ లైగర్ టీం స్పెషల్ AV ని విడుదల చేసింది.
యూత్ లో యమా క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.