by సూర్య | Sat, Aug 06, 2022, 03:15 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో, తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది. ప్రస్తుతం వైజాగ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఒక నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంట. దీనికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే, వచ్చే ఏడాది సంక్రాంతికే ప్రభాస్ "ఆదిపురుష్" కూడా విడుదల కాబోతుండడంతో, పాన్ ఇండియా సినిమాతో క్లాష్ వద్దనుకున్న దిల్ రాజు వారసుడును వాయిదా వెయ్యబోతున్నాడట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందంట.