by సూర్య | Sat, Aug 06, 2022, 12:48 PM
పలాస 1978, మెట్రో కధలు, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "కళాపురం". ఇందులో సత్యం రాజేష్, సంచిత పూనాచా, చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి, జనార్దన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, R 4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఫన్నీగా, ఫ్రెష్ గా అనిపించింది. పోతే, ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.