by సూర్య | Fri, Aug 05, 2022, 07:03 PM
విమల్ కృష్ణ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం "డీజే టిల్లు". "గుంటూరు టాకీస్" ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
లేటెస్ట్ గా డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పుకున్న విమల్ అక్కినేని హీరోతో సినిమా చెయ్యనున్నాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. విమల్ కృష్ణ అక్కినేని నాగచైతన్య కు ఒక స్టోరీని వినిపించారని, ఆ స్టోరీ చైతూకు కూడా బాగా నచ్చిందని తెలుస్తుంది. ఈ వార్త నిజమైతే, ఈ ఇద్దరి కాంబోలో రాబోయే మూవీకి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావొచ్చు.