బుల్లితెరపై కూడా "రాధేశ్యామ్" కు నిరాశే ... డీలాపడ్డ డార్లింగ్ ఫ్యాన్స్

by సూర్య | Thu, Jul 07, 2022, 03:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అందమైన ప్రేమ కథ ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. ప్రభాస్ నుండి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ను కోరుకునే ప్రేక్షకులకు ఈ క్లాస్ లవ్ ఎంటర్టైనర్ అంతగా నచ్చలేదనే చెప్పాలి. కానీ ప్రభాస్ అభిమానులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది.
థియేటర్లలో ఉసూరుమనిపించిన రాధేశ్యామ్ ఓటిటిలో ఫర్వాలేదనిపించింది. కానీ, బుల్లితెరపై మళ్ళీ ఉసూరుమనిపించింది. జూన్ 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానెల్ లో తొలిసారి టెలికాస్ట్ ఐన రాధేశ్యామ్ కు కేవలం 8.25 TRP మాత్రమే వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రీసెంట్ డిజాస్టర్ "కొండపొలం" (12.34)కు రాధేశ్యామ్ కన్నా ఎక్కువ TRP రావడం నిజంగా ప్రభాస్ ఇమేజ్ కు బిగ్ డామేజ్ కలిగించే విషయమని చెప్పాలి. దీనిపట్ల డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM