మరోసారి నోరుజారిన "యాక్షన్" హీరో... ఈసారి డబుల్ ట్రోలింగ్!

by సూర్య | Thu, Jun 23, 2022, 06:21 PM

లాక్ డౌన్ టైం లో చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా ఫిలిం ఇండస్ట్రీని ఆదుకున్న సంస్థ ఓటిటి రంగం. గత రెండేళ్లుగా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు పలు ఓటిటీలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఇదిలా ఉండగా, ఒక బాలీవుడ్ హీరో ఓటిటిలో నటించటాన్ని చులకన చేసి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. 
తానొక బాలీవుడ్ నటుడినని, ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించనని, ఇండియాలో టాప్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్డేనని వ్యాఖ్యానించి వివాదాస్పదమైన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తాజాగా మరోసారి నోరుజారి మాట్లాడారు. తనొక బిగ్ స్క్రీన్ హీరోనని, తనకు అక్కడ నటించడమే ఇష్టమని, రూ. 299, రూ. 499 లకు లభించే ఓటిటిలో నటించటం తనకిష్టం లేదని చెప్పారు. ఓటిటీని కించపరుస్తూ జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీసాయి. దీంతో జాన్ ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM