బస్సు యాత్రకు ముందే వీరమల్లు షూటింగ్ పూర్తి?

by సూర్య | Wed, Jun 22, 2022, 04:39 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "హరిహర వీరమల్లు". క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్టుతో నిర్మితమవుతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడం, ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. తాజాగా పవన్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు జనసేన పార్టీని రూట్ లెవెల్ నుండి బలోపేతం చెయ్యటానికి ఇప్పుడు కన్నా మరింత ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ త్వరలోనే బస్సు యాత్రను కూడా ప్రారంభించబోతున్నాడు. ఈ బస్సు యాత్రకు ముందే, ఆల్రెడీ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. ఈ సమయాన్ని కేవలం వీరమల్లుకే కేటాయించి, మిగిలిన సినిమాల సంగతిని తర్వాత చూద్దామనే ఆలోచనలో ఉన్నాడని టాక్. ఈ విషయంపై మరింత క్లారిటీ రావలసిఉంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM