by సూర్య | Mon, May 23, 2022, 10:20 PM
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఢీ. ఇందులో జెనీలియా హీరోయిన్. దివంగత నటుడు శ్రీహరి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించగా నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయటం విశేషం. విష్ణు కెరీర్లో 5వ సినిమాగా వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 13, 2007లో విడుదలై సూపర్ హిట్ అయింది. విడుదలకు ముందు ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో దాదాపు పదకొండు కోట్ల షేర్ ను రాబట్టింది. కోన వెంకట్, గోపి మోహన్ ల పంచ్ డైలాగులు, బ్రహ్మి,విష్ణుల కామెడీ, శ్రీను వైట్ల టేకింగ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. ఢీ మూవీ పోస్టర్స్ లో బాగా పాపులర్ అయిన ఒక ఫోజును ఈ మధ్యనే కలుసుకున్న మంచు విష్ణు, జెనీలియాలు రీ క్రియేట్ చేసారు. ఈ ఫోజును, పాత పోస్టర్ ను కంపేర్ చేస్తూ, మాలో ఎలాంటి తేడా రాలేదు, 15ఏళ్లుగా మా మధ్య బంధం బాగా బలపడింది... అంటూ విష్ణు మంచు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఢీ సీక్వెల్ కు ముహూర్తం ఖాయం చేసారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తునాన్రు.
Latest News