by సూర్య | Mon, May 23, 2022, 10:11 PM
టాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. GA 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో సత్యరాజ్, రావు రమేష్, యాంకర్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ గోపీచంద్ - రాశిఖన్నా జిల్ మూవీలో జత కట్టిన విషయం తెలిసిందే.
జెక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News