by సూర్య | Mon, May 23, 2022, 10:09 PM
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. తమన్నా భాటియా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లబ్ డబ్ డబ్బో, ఊఁ ఆఁ ఆహా ఆహా, లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా అనే పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇందులో గ్లామర్ బ్యూటీ పూజాహెగ్డే ఐటెం సాంగ్ చేస్తుంది.
మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ముందు దాదాపు రూ. 80కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉన్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు సొంత నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నైజాం లో దిల్ రాజునే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 63 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 7 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 7 కోట్లు కలుపుకుని మొత్తం సుమారుగా రూ. 75-78 కోట్ల కు అమ్ముడయ్యాయని టాక్. దీంతో ఎఫ్ 3 చిత్రం ముందు ఎనభై కోట్ల భారీ టార్గెట్ ఉంది. సాధారణ టికెట్ రేట్లతో బరిలోకి దిగబోతున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను అధిగమించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
Latest News