by సూర్య | Sun, May 22, 2022, 12:22 PM
ప్రస్తుత కాలంలో నార్త్ లో సౌత్ సినిమాల హవా అందిస్తుంది. సౌత్ సినిమాలు నార్త్ లో వందల కోట్లు వసూలు చేస్తుంటే, నార్త్ సినిమాలు కనీసం నార్త్ లో బ్రేక్ ఈవెన్ సాధించలేక ఉసూరుమంటున్నాయి. దీంతో తమ పరువును, ఈగోను మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తిరిగి తీసుకొస్తారని బాలీవుడ్ ఎదురుచూస్తుంది. లాల్ సింగ్ చద్దా తో వసూళ్ల సునామీని సృష్టిస్తారని ఆశపడుతున్నారు. దంగల్, పీకే, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఆమీర్ ఖాన్ ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
1994లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మిస్టర్ పర్ఫెక్ట్ కు జతగా కరీనా కపూర్ ఖాన్ నటిస్తున్నారు. కీలక పాత్రలో టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు చైతు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక వివాదాస్పదకర అంశానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని తాజా సమాచారం. 90ల నాటి కీలకమైన చారిత్రక పేలుళ్ల నేపథ్యంలో అంటే బాబ్రీ మసీదు బాంబు బ్లాస్ట్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని టాక్. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 11 న విడుదలవబోతుంది.
Latest News