by సూర్య | Sun, May 22, 2022, 09:00 AM
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటిన సమ్మతమే చిత్ర నటీనటులు కిరణ్, చాందిని, నిర్మాత ప్రవీణ. ఈ సందర్భంగా చిత్ర హీరో కిరణ్, హీరోయిన్ చాందిని మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నిర్మాత ప్రవీణ కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం చిత్ర బృందానికి గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.
Latest News