by సూర్య | Sat, May 21, 2022, 12:10 PM
హ్యాపీ డేస్, యువత, కేశవ, కార్తెకేయ వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెరుచుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నారు. గ్యారీ బిహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాకి 'స్పై' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని 2022 దసరాకు విడుదల చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ సరసన ఈ సినిమాలో ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నికల్ టీమ్- సినిమాటోగ్రాఫర్ కైకో నఖరా మరియు యాక్షన్ డైరెక్టర్ లీ విటేకర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ అమరు ప్రస్తుతం కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అభినవ్ గోమతం, మకరంద్ దేశ్పాండే, సన్యా ఠాకూర్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News