by సూర్య | Sat, May 21, 2022, 12:08 PM
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ 'ఎఫ్ 3' ని చేస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటించిన మల్టీస్టారర్ గా ఎఫ్ 3 చిత్రం తెరకెక్కింది. ఇందులో వెంకటేష్ కు జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకులను పలకరించడానికి సిద్దపడింది. దీంతో గత కొద్దిరోజుల నుండి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎఫ్ 3 మూవీలో టాలీవుడ్ హాస్య ప్రసిద్ధులైన జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ ల మార్కు కామెడీ ఉంటుందని చెప్పారు. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ స్క్రిప్ట్ ను చాలా గొప్పగా రచించారు, అంతకన్నా గొప్పగా తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేని, చాలా ఆరోగ్యకరనైన కామెడీతో ఒక మంచి మెసేజ్ ను ఎఫ్ 3 లో చూపించారని డీఎస్పీ పేర్కొన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితో పని చేస్తే అస్సలు టెన్షన్ అన్న మాట ఉండదని చెప్పారు. ఎఫ్ 2 తరహాలోనే ఎఫ్ 3లో కూడా సిట్యుయేషన్ కు తగ్గట్టు మంచి పాటలు కుదిరాయని, ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతాయని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.
Latest News