by సూర్య | Fri, May 20, 2022, 03:09 PM
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు... నన్ను భరించలేని పరిశ్రమలో అడుగు పెట్టి టైం వేస్ట్ చెయ్యదలచుకోలేదని అని మహేష్ అన్న మాటలు కాంట్రవర్సీ కి దారితీసాయి. అయితే ఆ తర్వాత తను చేసిన వ్యాఖ్యలు ప్రజలకు వేరేవిధంగా చేరటంతో మహేష్ ఈ విషయం పై వివరణ కూడా ఇచ్చుకున్నారు. మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడగా, మరి కొందరు మహేష్ కు మద్దతునిచ్చారు.
మహేష్ చేసిన బాలీవుడ్ ఎంట్రీ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్ నటి అమీషాపటేల్ స్పందించారు. నాని చిత్రంలో మహేష్ బాబు, అమీషాపటేల్ కలిసి నటించారు. మహేష్ ఎంతో మంచి వ్యక్తి అని, ఇతరుల పట్ల చాలా గౌరవం గా ఉంటారని అమీషా చెప్పింది. బాలీవుడ్ ను కించపరిచే విధంగా మహేష్ మాట్లాడివుండరని, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, అందుకే ఆయన అన్న మాటలు వేరేవిధంగా జనాలకు చేరాయని అమీషా పేర్కొంది.
Latest News