by సూర్య | Fri, May 20, 2022, 02:54 PM
టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియన్ మూవీ "మేజర్" తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున "మేజర్" చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా జూన్ 3, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మూవీ టీమ్ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన మీడియా ఇంటీరియాక్షన్ లో విక్రమ్ మరియు అక్షయ్ నటిస్తున్న పృథివీరాజ్ వంటి ప్రాజెక్ట్లతో మీ చిత్రాన్ని విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది అని అడిగినప్పుడు, 'తెలుగులో ఈ సినిమా పెద్ద చిత్రం, తమిళంలో విక్రమ్ మరియు హిందీలో పృథ్వీరాజ్ కూడా పెద్ద సినిమాలే. సముద్రంలో పెద్ద చేపలు ఉన్న మనం గోల్డ్ ఫిష్' అంటూ శేష్ సమాధామిచ్చాడు. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
Latest News