by సూర్య | Thu, May 19, 2022, 04:43 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా తొలి షోల నుండి మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి వారంలో 171 కోట్లు వసూలు చేసి రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద మాత్రమే 87 కోట్లను వసూలు చేసింది. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News