బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ కు కరోనా

by సూర్య | Sun, May 15, 2022, 11:02 AM

బాలీవుడ్ స్టార్ మీరో అక్షయ్ కుమార్‌ కోవిడ్ బారిన పడ్డాడు. కోవిడ్ పాజిటివ్‌గా తేలినందున ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావడం లేదని చెప్పాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనే సినీ ప్రముఖులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేన్స్‌కు వెళ్లే బృందంలో మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, మాధవన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నయనతార, పూజా హెగ్డే, తమన్నా భాటియా, శేఖర్ కపూర్, సీబీఎఫ్‌సీ చీఫ్ ప్రసూన్ జోషి, రికీ కేజ్ తదితరులు వెళ్లనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ పీరియాడికల్ మూవీ 'పృథ్వీరాజ్'లో అక్షయ్ కుమార్ నటించారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తైన ఈ సినిమా థియేటర్లలో జూన్ 3, 2022న విడుదల కానుంది.

ఇక తన అభిమానులను ఉద్దేశించి అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. “నాకు కోవిడ్-19 పరీక్షలలో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కోవిడ్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నాను. ప్రస్తుతం నేను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నాతో పరిచయం ఉన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. కోలుకుని త్వరలో అభిమానుల ముందుకు వస్తాను'' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాసేపటికే హాస్పిటల్‌లో చేరినట్లు మరో ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ కోవిడ్ బారిన పడడం ఇది రెండవసారి.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM