కేజీఎఫ్-3పై నిర్మాత నుంచి క్రేజి అప్‌డేట్

by సూర్య | Sat, May 14, 2022, 10:14 PM

కేజీఎఫ్ చాప్టర్-2 2022లో అతిపెద్ద భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 14, 2022న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను బద్దలుగొట్టింది. నేటికీ భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పిస్తోంది. ఈ తరుణంలో ఈ సినిమా చాప్టర్-3 ఉంటుందని సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీఎఫ్-3ని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్‌' సినిమాతో బిజీగా ఉన్నారని కిరగందూర్ చెప్పారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతంపైగా పూర్తైందని తెలిపారు. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుందన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి 'సలార్' సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కిరగందూర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్-3 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. 2024 నాటికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-2 దేశంలో బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,100 కోట్ల వసూళ్లను సాధించింది. యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టిగా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM