మే 20న ఆచార్యుడి డిజిటల్ స్ట్రీమింగ్ ఖచితమే, ప్రకటించిన ప్రైమ్ వీడియో

by సూర్య | Sat, May 14, 2022, 03:47 PM

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తొలి సారి తెరపై ఎక్కువసేపు కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న,  చిరంజీవి 153 వ సినిమాగా విడుదలైన ఆచార్య తొలి షో నుండే నిగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి పురోగతిని సాధించలేకపోయింది.  బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లతోనే అట్టట్టా నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య ఓటీటి స్ట్రీమింగ్ పై అంతటా ఆసక్తి నెలకొంది. అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటిలో స్ట్రీమింగ్ కానుందని చాలా వార్తలే వినిపించాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. మే 20 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఆచార్య స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఈ సినిమా విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటిలోకి రావలసి ఉంది. కానీ, ఆచార్య ధియేటర్ టాక్, వస్తున్న కలెక్షన్ల దృష్ట్యా అనుకున్న సమయానికన్నా 30 రోజుల ముందే డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆచార్య నిర్మాతలను కోరిందట. ఇందుకోసం ఆచార్య నిర్మాతలకు ఆ ఓటీటి సంస్థ 15-20కోట్లు ముట్టజెపుతుందని టాక్. ఆచార్య నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. మరి నిర్మాతలు ఆ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే, అమెరికాలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఇండియా కి తిరిగి రావాలి.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM