by సూర్య | Sat, May 14, 2022, 02:39 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. విడుదలైన తొలి రోజు ఈ చిత్రం భారీ షేర్ని కలెక్ట్ చేసింది. PR ప్రకారం, ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 75 కోట్లు వసూలు చేసింది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News