by సూర్య | Sat, May 14, 2022, 02:17 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నెల్లూరులో 41 లక్షలు వసూలు చేయగా దీనితో ఈ సినిమా నెల్లూరులో టోటల్ గా 1.97 కోట్లకి చేరింది. మరోవైపు, ఈ యాక్షన్ డ్రామా కృష్ణా రీజియన్లో రెండవ రోజు 89 లక్షలను వసూలు చేసింది. దీనితో కృష్ణలో ఈ సినిమా టోటల్ గా 3.47 కోట్ల వాసులు చేసినట్లు సమాచారం. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News