by సూర్య | Sat, May 14, 2022, 02:14 PM
వక్కంతం వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సీనియర్ ఫిల్మ్ మేకర్ వంశీ సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ స్క్రిప్ట్ని డెవలప్ చేసిన విధానం పట్ల నితిన్ ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. రాబోయే కొద్ది రోజుల్లో మూవీ మేకర్స్ ఈ సినిమాని అధికారకనగా ప్రకటించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజికవర్గం' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.
Latest News