by సూర్య | Sat, May 14, 2022, 02:08 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 75 కోట్ల వసూలు చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, 'సర్కారు వారి పాట' సినిమా USAలో $1.5 మిలియన్ మార్క్ను క్రాస్ చేసింది అని సమాచారం. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News