ఖైదీ సీక్వెల్ రాబోతోంది...ఈ సినిమాలో అదే ప్రత్యేకత

by సూర్య | Sat, May 14, 2022, 01:42 PM

ఈ మధ్య కాలంలో సీక్వెల్ చిత్రాల నిర్మాణం ఊపందుకొంది. ఇదిలావుంటే కార్తి 'ఖైదీ' సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఎలాంటి ఖర్చు పెట్టలేదు. భారీ స్థాయిలో ఎలాంటి సెట్లు వేయలేదు. కథలో కనిపించేవి మూడే మూడు. ఒకటి పోలీస్ స్టేషన్ .. రెండోది గర్ల్స్ హాస్టల్ .. మూడోది విలన్ డెన్. విలన్ గ్యాంగ్ నుంచి పోలీసులను ఒక ఖైదీ కాపాడటమనే లైనే కొత్తగా ఉంటుంది.


సినిమా మొత్తంలో ఆర్టిస్టులంతా సింగిల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తారు. అయినా ఎక్కడా బిగి తగ్గకుండా నడిచే ఈ కథ కాసుల వర్షం కురిపించింది. అందువలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో సీక్వెల్ చేయడానికి కార్తి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య కూడా చేయనున్నాడనేది తాజా సమాచారం.


'ఖైదీ' సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య - కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. 'విక్రమ్' ను రిలీజ్ కి రెడీ చేస్తున్న లోకేశ్ కనగరాజ్, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేయనున్నాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM