by సూర్య | Sat, May 14, 2022, 01:34 PM
కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెడ్గే జంటగా నటించనుంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఆచార్య' సినిమా మే 20, 2022 నుండి ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
Latest News