by సూర్య | Sat, May 14, 2022, 01:25 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా తొలి షోల నుండి మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి అభిమానులు, సినిమా ప్రేమికులు అండ్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం, 'సర్కారు వారి పాట' సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $1.2 మిలియన్ మార్క్ను క్రాస్ చేసినట్లు సమాచారం. అదే విషయాన్ని మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ప్రకటించారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News