by సూర్య | Sat, May 14, 2022, 11:01 AM
లైగర్ సినిమాతో పాన్ ఇండియా రంగ ప్రవేశం చేస్తున్న పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమా విడుదలకాకుండానే మరో పాన్ ఇండియా సినిమాను ఎనౌన్స్ చేసి ప్రేక్షకులతో పాటు చిత్రసీమను కూడా ఆశ్చర్యపరిచారు. పూరి తన డ్రీమ్ ప్రాజెక్టు గా పేర్కొంటున్న JGM చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. . మిలిటరీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా నడుస్తుందని టాక్. ఇది పాన్ ఇండియా సినిమా కావటంతో బాలీవుడ్ నటిని హీరోయిన్ గా పెట్టుకుంటే అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావించి, సినియర్ అందాల నటి లేట్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్గా అని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ JGM లో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే పేరు వినబడింది. తాజాగా ఈ విషయం కంఫర్మ్ కూడా అయింది. నిన్ననే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించటానికి పూజా ఒప్పుకుని, సంతకం కూడా చేసిందట. ఇప్పటికే ఈ భామ సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చెప్పాలంటే, రాధేశ్యామ్, బీస్ట్ ల తర్వాత పూజా చేస్తున్న మూడవ పాన్ ఇండియా సినిమా JGM. మొదటి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవగా, మూడో సినిమాగా రాబోతున్న JGM పరిస్థితేంటో?
Latest News