by సూర్య | Fri, May 13, 2022, 04:52 PM
భాగ్యనగరంలో మరో మల్టీప్లెక్స్ ఆవిర్భవించింది. భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్ నేడు హైదరాబాద్ లో 4వ మల్టీప్లెక్స్ను ప్రారంభించింది. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ చేతులమీదుగా ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 7 స్క్రీన్లు , 1534 సీట్లు ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా 72 నగరాలలో 688 స్క్రీన్లను, 162 మల్టీప్లెక్స్ లను ఐనాక్స్ కలిగి ఉంది.
అడవిశేష్ కొత్త చిత్రం మేజర్. శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదలవ్వబోతుంది. ఈ మేరకు గత కొద్దిరోజుల నుండి శేష్ ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల వీలైనంత ఎక్కువ హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Latest News