by సూర్య | Thu, Jan 13, 2022, 05:01 PM
సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఉభయ పక్షాలూ ఆమోదించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారని చిరంజీవి వివరించారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తాను వివరించానని, వాటిపై సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం జగన్ అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చారని, మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో రానున్నట్లు భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Latest News