by సూర్య | Thu, Jan 13, 2022, 12:46 PM
ఈ మద్యకాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండింగ్ నడుస్తుంది. భారతీయ సినిమాలో "RRR" హీరోలు రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా గుర్తింపు వచ్చింది అని అందరికి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్లో మరో ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మన ముందుకు వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన "అఖండ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి శ్రీను అల్లుఅర్జున్ మరియు బాలయ్య తో ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ న్యూస్ గురించి బోయపాటి శ్రీను గారిని అడిగినపుడు అయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏది అయినా జరగొచ్చు, సరైన టైమ్ లో అని సరైన విషయాలు జరుగుతాయి అని చెప్పారు. ఈ మల్టీ స్టారర్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మల్టీ స్టారర్ కన్ఫర్మేషన్ కోసం మెగా అభిమానులు,నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య మరియు అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధాన్ని "అఖండ" ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను అలాగే అన్స్టాపబుల్ షో లో మనం చూశాం.
Latest News