by సూర్య | Thu, Jan 13, 2022, 12:17 PM
'క్రాక్ సినిమా విజయంలో భాగస్వామిగా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమారు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నారు. తాజాగా ఆమె ఆద్య పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఎం.ఆర్. కృష్ణమామిడాల దర్శకత్వంలో పిఎస్ఆర్, కుమార్ (బాట్టి వైజాగ్ ), ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం నుండి హైదరాబాద్లో మొదలవుతోంది. శ్రీసాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ మీద బాబ్ది నిర్మించిన తొలి చిత్రం 'షికారు'. త్వరలో విడుదలకు ముస్తాబు అవుతోంది. 'షికారు' తరువాత బాబ్ది నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం 'ఆద్య'. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బ పటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్ర, సూర్య తదితరులు నటిస్తున్నారు.
Latest News