by సూర్య | Thu, Jan 13, 2022, 12:05 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ బాబు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ కెరీర్లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది మేకర్స్. ఈ సినిమా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. మహేష్ అయితే ప్రస్తుతానికి రెస్ట్ లోనే ఉన్నా మహేష్ లేని సన్నివేశాలను పెట్ల తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లేటెస్ట్ షూట్ పై మరింత సమాచారం ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా ఈ టోటల్ షెడ్యూల్ ఈ జనవరి 15 నాటికి కంప్లీట్ అవ్వనుంది అని తెలుస్తుంది. ఆల్రెడీ బీచ్ ఏరియా, జగదాంబ ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జరిగిందట.
Latest News