కరోనా నుంచి కోలుకున్న త్రిష

by సూర్య | Wed, Jan 12, 2022, 02:45 PM

చెన్నై చంద్రం త్రిష ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. త్రిష స్వయంగా ఈ విషయంపై అప్డేట్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకిందని వెల్లడించిన ఈ బ్యూటీ అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరింది.అంతేకాదు వ్యాక్సిన్ వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఉన్నానని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఇక త్రిషకు కోవిడ్-19 అని తెలియగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అభిమానులకు తాజాగా ఓ బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది త్రిష. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందని తెలియజేస్తూ అభిమానుల ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు చెప్పింది. “ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022” అంటూ ఈ పిక్ ను పోస్ట్ చేసింది త్రిష.


ఇక త్రిష సినిమాల విషయానికొస్తే తమిళంలో ఆమె బిజీగా ఉంది. తెలుగులో చివరిసారిగా 2016లో వచ్చిన ‘నాయకి’ సినిమాలో కన్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుస తమిళ చిత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్” గురించి. ఈ చిత్రం భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందుతోంది. ఆ తరువాత మోహన్ లాల్ తో కలిసి ‘రామ్’, ‘రాంగి’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది త్రిష.


Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM