by సూర్య | Tue, Jan 11, 2022, 12:32 PM
వివాదాల దర్శకుడు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ ఖాతాలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది...కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది... “కట్టప్పను ఎవరు చంపారు? " అంటూ పేర్కొన్నారు. ఐతే సోమవారం మంత్రి పేర్ని నానిని, ఆర్జీవీ కలిసి తన ప్రశ్నలు మరియు తన సూచనలు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా పేర్ని నానిని అడగగా తాను చెప్పాలిసింది చెప్పారు అలానే వత్తిని కూడా పరిగణలోకి తీసుకోమని ప్రేవెలజ్ కమిటీకి అందిస్తాము అని బదులు చెప్పారు.
Latest News