by సూర్య | Tue, Nov 23, 2021, 12:42 PM
సినీనటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. సత్యనారాయణ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన కుమార్తె రమాదేవి తెలిపారు. ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. కైకాల చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, అందరితో మాట్లాడుతున్నారని రమాదేవి తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, కైకాల ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రమాదేవి అన్నారు.
Latest News