by సూర్య | Mon, Nov 22, 2021, 09:45 AM
ఇటీవల విడుదలైన జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వన్నియార్ కులస్తులను కించపరిచేలా ఉన్నాయని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జై భీం చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ స్పందించారు. తమ సినిమాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్షమాపణలు చెప్పారు. ఏ కులాన్ని, వ్యక్తిని కించపరిచే ఉద్దేశ్యంతో సినిమా తీయలేదని స్పష్టం చేశారు. జై భీం సినిమా విషయంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి హీరో సూర్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని జ్ఞానవేల్ స్పష్టం చేశారు. జై భీమ్ సినిమా ద్వారా ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు నిర్మాతగా, నటుడిగా సూర్య ప్రయత్నించారని, ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారని జ్ఞానవేల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదానికి కారణమైన సూర్య కూడా క్షమాపణలు చెబుతాడని వెల్లడించారు.
Latest News