నన్ను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహ

by సూర్య | Thu, Nov 18, 2021, 08:10 PM

ప్రముఖ నటి స్నేహ అందరికి పరిచయస్తురాలే... తెలుగులో ‘తొలివలపు’ సినిమాతో స్నేహ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ఆమె నటించారు. అయితే, రెండో సినిమా ‘ప్రియమైన నీకు’తో స్నేహకు మంచి గుర్తింపు వచ్చింది. ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించారు. ఇందులో ప్రశాంత్‌కు భార్యగా, రామ్ చరణ్‌కు వదినగా స్నేహ నటించారు. అయితే నటి స్నేహ చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలపై కణత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడిపిస్తున్నారు. వారు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ రూ.26 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే, ఎంతకీ వాటా ఇవ్వకపోగా, తాను పెట్టుబడిగా పెట్టిన రూ.26 లక్షలు కూడా తిరిగి చెల్లించలేదని స్నేహ ఆరోపిస్తున్నారు. తన డబ్బుపై వడ్డీ అయినా చెల్లించాలని కోరినా వారి నుంచి స్పందన రాలేదని,  డబ్బు ఇవ్వాలని కోరడంతో బెదిరించారని, గట్టిగా అడగడంతో దాడికి దిగారని స్నేహ ఆరోపించారు. స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు పోలీసులు పోలీసులు.

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM