స్పీడ్ పెంచిన రాశి ఖన్నా.. అటు బాలీవుడ్ లోను.. ఇటు తమిళంలోను బిజీనే..

by సూర్య | Thu, Nov 18, 2021, 05:48 PM

హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అంతే కాకుండా హిందీలో అయితే ఏకంగా ఫ్యామిలీ మెన్ సీజన్ దర్శకులైన రాజ్ అండ్ డీకే కాంబోలో రాబోతోన్న వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటిస్తోంది. ఇక తెలుగులోనూ రాశీ ఖన్నా రెండు ప్రాజెక్ట్‌లు చేతిలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోను..  ఇటు తమిళంలోను ఈ అమ్మడు బిజీనే..
ఈ నేపథ్యంలోనే ఆమెకి బాలీవుడ్ లో  'యోధ' సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక నాయికగా దిశా పటాని చేయనుండగా, మరో నాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారట. కాస్త ఆలస్యమైనా అనుకున్న దిశగానే రాశి ఖన్నా స్పీడ్ పెంచినదని అనుకుంటున్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM