by సూర్య | Thu, Nov 18, 2021, 05:48 PM
హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ ప్రాజెక్ట్లతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అంతే కాకుండా హిందీలో అయితే ఏకంగా ఫ్యామిలీ మెన్ సీజన్ దర్శకులైన రాజ్ అండ్ డీకే కాంబోలో రాబోతోన్న వెబ్ సిరీస్లో రాశీ ఖన్నా నటిస్తోంది. ఇక తెలుగులోనూ రాశీ ఖన్నా రెండు ప్రాజెక్ట్లు చేతిలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోను.. ఇటు తమిళంలోను ఈ అమ్మడు బిజీనే..
ఈ నేపథ్యంలోనే ఆమెకి బాలీవుడ్ లో 'యోధ' సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక నాయికగా దిశా పటాని చేయనుండగా, మరో నాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారట. కాస్త ఆలస్యమైనా అనుకున్న దిశగానే రాశి ఖన్నా స్పీడ్ పెంచినదని అనుకుంటున్నారు.