by సూర్య | Wed, Nov 17, 2021, 09:06 PM
హైదరాబాదులో లాల్ బంగ్లాలో ఈరోజు యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని తెలిపారు . సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పించాలని చిరంజీవి అడిగారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.
Latest News