by సూర్య | Tue, Oct 26, 2021, 04:48 PM
సూపర్స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సర్కారువారి పాట'. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ , మహేశ్ బాబు సొంత నిర్మాత సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేశ్, కీర్తిలపై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇంతలో సెట్స్ లోకి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఎంట్రీ ఇచ్చారు.
వైట్ కాస్ట్యూమ్స్ తో మెరిసిపోతున్న అందాల కథానాయిక కీర్తి సురేశ్ తో ఆమె ముచ్చటించారు. ఇద్దరి మధ్యా కాసేపు సరదా సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్ స్టా పేజ్ లో తెలిపారు. కీర్తితో ఆమె మాట్లాడుతున్న ఓ పిక్ ను షేర్ చేశారు నమ్రత. కీర్తి సజెషన్ లో నమ్రత నవ్వులు చిందిస్తున్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ బాబుకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎంతో శ్రద్ధగా డీల్ చేస్తారు నమ్రత. ఈ క్రమంలో సొంత ప్రొడక్షన్స్లో రూపొందుతోన్న 'సర్కారు వారిపాట' సినిమా షూటింగ్ కు తన పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సెట్లో కథానాయిక కీర్తి సురేశ్ తో ఆమె కాసేపు ముచ్చటించారు నమ్రత. ప్రస్తుతం నమ్రత, పిల్లలు గౌతమ్, సితార కూడా స్పెయిన్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Latest News