by సూర్య | Tue, Oct 26, 2021, 12:48 PM
ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నడు. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేశాయి. అయితే తాజా ప్రచారం ఆది పురష్ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా మొదలైనట్టు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారు.ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేయగా.. ఈ షెడ్యూల్తో ప్రభాస్ కూడా తన పార్ట్ షూట్ కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓం రౌత్ మాత్రం చాలా స్పీడ్ గా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. కాగా త్రీడీ నేపథ్యంలో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.
Latest News