by సూర్య | Tue, Oct 26, 2021, 10:31 AM
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎలాంటి గొడవలు లేకుండా ఎమోషనల్గా సాగింది. ఒకరికొకరు త్యాగాలు చేయడం, ఇంటి నుండి వచ్చిన లెటర్స్ చదివి భావోద్వేగానికి గురి కావడం వంటివి జరిగాయి. అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా జెస్సీకి లేఖ లభించలేదని.. అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లేఖను అతనికి ఇవ్వకుండా ముక్కలు చేసి నామినేట్ చేయొచ్చని సేవ్ చేయాలనుకుంటే అతని లేఖను అందించవచ్చని బిగ్ బాస్ చెప్పారు.
జెస్సీ కోసం త్యాగం చేసేందుకు ప్రియాంక, శ్రీరామ్ ముదుకు వచ్చారు. గతంలో జెస్సీ- శ్రీరామ్ మధ్య డిస్ట్రబెన్స్ ఏర్పడగా,దాన్ని క్లియర్ చేసేందుకు శ్రీరామ్ తన లెటర్ని త్యాగం చేయాలని అనుకున్నాడు.అయితే ఇది కేవలం లెటర్ కోసమే కాదు.. నామినేషన్స్లోకి వెళ్తారు.. దీనికి నేను ఒప్పుకోను అని జెస్సీ అన్నాడు. చివరికి శ్రీరామ్ జెస్సీని కన్వెన్స్ చేసి ఒప్పించి మరీ నామినేషన్స్లోకి వెళ్లాడు శ్రీరామ్.
చాలా వెరైటీగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఈ వారం మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ కావడంతో వారిలో ఎవరు ఇంటి నుండి వెళతారనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక చివరిగా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా ఉన్న సన్నీకి కూడా ఇంటికి నుంచి లెటర్ వచ్చింది. సన్నీ తల్లి కళావతి రాసిన లెటర్ని చదివి వినిపించింది కాజల్. ఇది విని ఎమోషనల్ అయ్యాడు సన్నీ.
Latest News